ఒకానొకప్పుడు ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు.అతను బృందావనం తీర్థయాత్రకై వెళ్తున్నాడు . ఆనాటి రాత్రి అతను నిద్ర పోతుండగా అతని జేబులో నుండి పర్సు జారి క్రింద పడిపోయంది. మరునాటి ఉదయం తోటి ప్రయాణికుడు ఒకడు ఈ పర్సు ను చూసి ఇది ఎవరిదీ ?”అని అడిగాడు. ఈ వృద్ధుడు ఆ పర్సు తనదేనని చెప్పాడు .ఆ పర్సు తనదేనని చెప్పటానికి గుర్తు అందులో కృష్ణుడి ఫోటో ఒకటి ఉంటుంది అని చెప్పాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ పర్సు ను గురించిన కథను చెప్పటం ప్రారంభించాడు. అతను చెప్పబోతున్న ఆ పర్సు గురించిన కథను వినటానికి చాలా మంది ప్రయాణికులు గుమి కూడారు .అందరికీ కనబడేలా ఆ పర్సును పైకి ఎత్తి చూపుతూ ఆ వృద్ధుడు ఇలా చెప్పసాగాడు.
ఈ వాలెట్ పర్సు కి సంబంధించి ఒక పెద్ద కథే ఉన్నది. చాలా ఏళ్ళక్రిందట మా నాన్నగారు నాకు ఈ పర్సును ఇచ్చారు. నేనప్పుడు చాలా చిన్న పిల్లవాడిని . స్కూల్ కి వెళ్ళి చదువుకొనే రోజులవి. అందులో కొంచెం పాకెట్ మనీ తో పాటు నా తండ్రి తండ్రుల ఫోటో ఒకటి అందులో పెట్టుకొనేవాడిని. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను పెద్దవాడినయ్యాను. యూనివర్సిటీ లో చదువుకుంటున్నాను. అందరు యవకుల లాగానే నేను కూడా, నా ఆకారం,అందం పట్ల శ్రద్ద పెంచుకున్నాను. పర్సులో ఉన్న నా తల్లితండ్రుల ఫోటో తీసివేసి నా ఫోటో పర్సులో పెట్టుకున్నాను . నా ఫోటో చూసుకుని నాకు నేనే మురిసిపోతూ ఉండేవాడిని. తరువాత నాకు వివాహం అయింది. నన్ను గురించిన ఆలోచన పోయి కుటుంబం వైపుకు నా ధ్యాస మళ్ళింది. నా ఫోటోను పర్సు లో నుండి తీసివేసి ఆ స్థానంలో నా భార్య ఫోటో పెట్టుకున్నాను. రోజులో చాలా సార్లు నా పర్సు తీసి అందులోని నా భార్య ఫోటో కేసి తదేకంగా చూస్తూ ఉండేవాడిని. నా అలసట అంతా పోయి మళ్ళీ ఉత్సాహంగా పనిలో నిమగ్నం అయ్యేవాడిని .తరువాత నాకు ఒక కొడుకు పుట్టాడు. తండ్రి అయినప్పుడు నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేనిది! ఆఫీస్ పని ముగుంచుకుని ఆతృతగా ఇంటికి వెళ్ళి నా బిడ్డతో ఆడుకునేవాడిని. వేరే చెప్పేదేముంది ? నా భార్య స్థానంలో నా కుమారుడి ఫోటో పెట్టేశానని వేరే చెప్పక్కర్లేదు కదా ! ఆ వృద్ధుడు ఒక్కక్షణం ఆగి నీళ్ళు నిండిన కళ్ళను తుడుచుకుంటూ చుట్టూ ఒకసారి కలియ చూసి విచారం నిండిన కంట స్వరంతో,“స్నేహితులారా ! నా తల్లితండ్రులు చాలా కాలం క్రితమే కన్ను మూసారు. ఐదు సంవత్సరాల క్రితం నా భార్య కూడా మరణించింది . ఒక్కగానొక్క కొడుక్కి వివాహం అయింది . వాడు తన ఉద్యోగం ,కుటుంభం బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. అతనికి నా కోసం సమయం లేదు. నేను ఇప్పుడు మృతువు అంచున ఉన్నాను. భవిష్యత్తులో నాకు ఏమి వ్రాసి ఉన్నదో నాకు తెలియదు. నేను ప్రేమించిన ప్రతిదీ, నా సొంతం అనుకున్న ప్రతీది నన్ను విడిచిపోయినది . ఇప్పుడు నా పర్సులో కృష్ణుడి ఫోటో ఉన్నది . అయన నన్ను ఎప్పుడూ విడిచి పెట్టడు అని నాకు తెలుసు. “కృష్ణుడి ఫోటోను నేను మొట్ట మొదటే నాపర్సులో పెట్టుకుని ఉంటే ఎంత బాగుండేది”, అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అయన ఒక్కడే సత్యం ! మిగిలినవి అన్నీ కదిలిపోయే నీడలే ! అని తన పర్సు కథను ముగించాడు.
నీతి :
భౌతికమైన దేహమునకు సంబంధించిన భంధాలన్నీ తాత్కాలికమైనవే . ఈ రోజు మనకు అవే సత్యంగా ,సర్వాంగా అనిపించవచ్చు . కానీ అవన్నీ మన జీవితం మొత్తాన్ని ముగించేస్తాయి . అవన్నీ ముందు ముందు మాయం అయిపోయేవే !
మన అసలైన బంధం భగవంతుడితోనే ! భగవంతుడు ప్రతి ఒక్కరి సొంతం. అది శాశ్వతమైన భందం . మన యోగ క్షేమములు గమనించేడి ఆయనే . విశ్వమంతా వ్యాపించించిన ఆ ప్రభువును పిలవండి! తనఆశీస్సులను ఆయన మీపై కురిపిస్తాడు . మన ఆస్తులన్నీ భూమిపై మిగిలిపోతాయి . పశువులన్ని పశుశాలలో ఉంటాయి . మన భార్య గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. మన భందువులు ,స్నేహితులు స్మశానం దాక వస్తారు. మన దేహం చితిలో కాలిపోయే వరకూ ఉంటుంది. కేవలం మన కర్మలు మాత్రమే మరణాంతరం మన వెంట వస్తాయి అందువల్ల మనం మంచి మాత్రమే చెయ్యటానికి ప్రయత్నించాలి .