Archive | August 2017

మూడు దోషములు

 

మూడు దోషములు — శ్రీ ఆది శంకరాచార్యా

 

IMG_5035

విలువ : సత్యం
విలువ — యధార్థము

 

శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.

గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట, “నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షేమించండి ” అని ప్రాధేయ పడ్డారు. ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.

ఒక శిష్యుడు,ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని , ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.

1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను. అది నా నేను చేసిన మొదటి దోషము “అని సమాధానమిచ్చారు.

2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన మొదటి తప్పు!

3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం.
న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను
అర్థము :
నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము ,భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను!

 

ఇంత వ్రాసికుడా నేను తీర్త యాత్రలు చేస్తున్నాను .
అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.

నీతి :
మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.
బైట ప్రపంచం మన పని తీరుని మటుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.
“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”
ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము .

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

నిజానికి మారుపేరు — రాజా సత్య హరిశ్చంద్ర

 

నిజానికి మారుపేరు — రాజా సత్య హరిశ్చంద్ర

 

IMG_4978

విలువ — సత్యము
అంతర్గత విలువ — నిజాయితీ

రాజా హరిశ్చంద్ర, భార్య తారామతి, కొడుకు రోహితాశ్వ తో అయోధ్య నగరాన్ని పరిపాలించేవారు. నగరంలో ప్రజలు అందరూ సుఖ-సంతోషాలతో ఉండేవారు.

రాజా హరిశ్చంద్ర, చిన్నప్పటి నుంచి, అబద్ధము ఆడకూడదు, అన్న మాటకి కట్టుబడి నిజాయతీగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. రాజా హరిశ్చంద్ర, తన చిత్తశుద్ధి , నిజాయితీకి, పేరు ప్రఖ్యాతలు పొందారు. రాజా హరిశ్చంద్ర గురించి దేవతలు తెలుసుకుని, పరీక్ష పెట్టడానికి, ఋషి విశ్వామిత్రను ఎంపిక చేసారు.

ఋషి విశ్వామిత్ర చాలా సార్లు , రాజా హరిశ్చంద్ర చేత తప్పు చేయిద్దాము అని ప్రయత్నించారు, కానీ రాజుగారు తన నియమానికి కట్టుబడి ఉండడం వల్ల, ఏ తప్పు చెయ్యలేదు.

విశ్వామిత్ర ఋషి , తన మాయతో కొన్ని సందర్భాలను సృష్టించారు. దానితో రాజుగారు, తన రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సంతోషంగా రాజ్యాన్ని విడిచి, కట్టు బట్టలతో, భార్యా, కొడుకుని తీసుకుని రాజ్యం నుండి బయటికి వచ్చేశారు.

విశ్వామిత్రుడు , రాజుగారి నిజాయితీకి ఆశ్చర్య పోయి, ఆఖరి ప్రయత్నంగా, రాజుగారిని దక్షిణ అడిగారు.

రాజుగారు, ఒక బ్రాహ్మణుడి మాట కాదు అనలేక , తన దగ్గర ఇవ్వడానికి ఏమి లేదని, ఒక నెల గడువు ఇస్తే, దక్షిణ ఇస్తాను అని ప్రాధేయ పడ్డారు.

రాజుగారు ఎంత ప్రయత్నించినా, పని దొరకలేదు. అన్ని ప్రయత్నాలు విఫలము అయ్యాయి. చివరికి కాశి (వారణాసి ) క్షేత్రము చేరారు.

కాశి నగరం ఒక పుణ్య క్షేత్రం. చాలా పాండిత్యము, భక్తి గల మనుషులతో నిండి ఉండేది. వృద్ధాప్యం లో ఉన్న వాళ్ళు కూడా కాశి క్షేత్రానికి వచ్చి ఉండేవారు. అంతటి క్షేత్రములో కూడా రాజుగారికి పని దొరకలేదు.

రాజుగారికి, విశ్వామిత్ర ఋషి ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. ఇంకా పని దొరకలేదు.
అప్పుడు రాజుగారి భార్య తారామతి ఈ విధంగా సలహా ఇచ్చారు.
“స్వామి నగరములో, గొప్పవాళ్ళ భవనంలో, ఇంటిలో నన్ను పనిమనిషిగా పంపండి . ఆ డబ్బుతో ఋషికి, దక్షిణ ఇవ్వచ్చు . పని దొరికాక నన్ను మళ్ళీ వెనుకకి తీసుకొచ్చెయ్యండి “.

రాజుగారికి ఎప్పుడూ తనకి తోడుగా ఉండే భార్యని ఇలా ఒకరింట్లో పనికి పెట్టాలంటే చాలా కష్టము వేసింది.

కానీ తప్పక, భార్యని, కొడుకుని , బజారులో నుంచోపెట్టి వేలం వేశారు. అప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు కొనుక్కోవడానికి సిద్ధ పడ్డారు. రాజుగారు వచ్చిన ధనమును, విశ్వామిత్రుడికి ఇవ్వగా, ఆయన “ఇదేనా ఇంతటి మహా జ్ఞానికి ఇచ్చే దక్షిణ అని ఆగ్రహించారు ”
రాజుగారికి ఏమి తోచలేదు. అదే సమయంలో త్రోవలో పోయే ఒక ఛండాలుడు, ‘స్మశానములో నాకు పనికి మనిషి కావాలి ” అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు , ‘ఆ పనిలో చేరి, నా దక్షిణ ఇవ్వు ” అని రాజుగారితో అన్నారు.
రాజుగారు తప్పని పరిస్థితిలో చండాలుడి దగ్గర పనికి చేరి, ఋషికి దక్షిణ ఇచ్చారు.
భార్యా, కొడుకు ఏ పరిస్థితి లో ఉన్నారో అని రోజూ అనుకునే వారు రాజుగారు.

ఒక రోజు ఉద్యాన వనంలో పువ్వులు కొయ్యడానికి తన కొడుకు వెళ్ళాడు. అక్కడ పాము కరిచి వెంటనే అతడు మరణించాడు. మహారాణి అయిన తారామతి అతి దుఃఖముతో కొడుకుని తీసుకుని స్మశానానికి వచ్చారు.
స్మశానములో ఉన్న రాజుగారు, భార్యని, మరణించిన కొడుకుని గుర్తుపట్టలేదు. శవాన్ని దహనము చెయ్యడానికి డబ్బులు అడిగారు. అప్పుడు తారామతి ‘నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పని చేస్తున్నాను, ఇవ్వడానికి నా దెగ్గర ఏమి లేదు. ఉన్న కొడుకుని కూడా పోగొట్టు కున్నాను ” అని అన్నారు. రాజుగారు ఆమె అన్న మాటలికి చాలా బాధ పడ్డారు. అప్పుడు ఆమె మెడలో ఉన్న మంగళసూత్రము చూసి “డబ్బుకి బదులిగా మంగళసూత్రము ” ఇవ్వమని అడిగారు.

తారామతి అప్పుడు రాజుగారిని గుర్తుపట్టి “స్వామి నేను మీ భార్యని , పడుకున్నది మన యువరాజు ” అని చెప్పగానే రాజుగారు చాలా బాధ పడ్డారు.
దహనము చెయ్యడానికి డబ్బు తీసుకోవడం తన ధర్మమని అన్నారు. అప్పుడు తారామతి తన ఒంటిమీద ఉన్న వస్త్రము తప్ప తన దెగ్గర ఇంక ఏమి లెదు అని, మంగళసూత్రము తియ్యబోయారు.

అప్పుడు ఆకాశం నుంచి దేవతలు, విశ్వామిత్ర ఋషి దిగి వచ్చారు.

ఈ కష్టాలన్నీ దేవతలు సృష్టించారు అని చెప్పారు. ఛండాలుడు వేషంలో ఉన్న యముడు ) , బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఇంద్రుడు కలిసి నడుచుకుంటూ వచ్చారు. మరణించిన కొడుకు, కళ్ళు నలుపు కుంటూ లేచి వచ్చాడు.

సంతోషంతో విశ్వామిత్ర ఋషి, దేవతలు హరిశ్చంద్రుని నిజాయితీకి మారుపేరు అని ప్రకటించారు.

నీతి:
హరిశ్చంద్ర అనే పేరు నీతీ, నిజాయితీలకి ప్రతీక.ఆయన జీవిత చరిత్ర చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది.

నిజాయితీ ఎంతో గొప్ప గుణము. ఎవరైతే నిజాయితీగా జీవిస్తారో , వాళ్ళు ఎటువంటి కష్టము నుండైనా ,విజయవంతంగా బయట పడగలుగుతారు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

గురువుగారు పెట్టిన పరీక్ష

గురువుగారు పెట్టిన పరీక్ష

విలువ — సరైన నడత
అంతర్గత విలువ — భిన్నవాదం , గురువు మీద పూర్తీ శరణాగతి.

IMG_4727

అంగీరస అనే ఒక ఋషి అడవిలో ఉండేవారు. ఆయనకి చాలా మంది శిష్యులు.
శిష్యులు అందరూ గురువుగారి జ్ఞానం వల్ల, ప్రయోజనం పొందారు. వారిలో కొంత మంది శిష్యులు, గురువుగారు చెప్పిన మాట పాటిస్తూ , అన్ని విషయాలు తొందరగా నేర్చుకునే వాళ్లు. వీళ్లు మిగతా శిష్యుల దగ్గర నుంచి ఆదరణ పొందేవాళ్ళు.

కొంత మందబుద్ధి గల శిష్యులకి, ఈ భక్తి గల శిష్యులని చూసి అసూయ కలిగింది.
వారి జాడ్యానికి కేవలం వాళ్లే కారణమూ అని, మందబుద్ధి గల శిష్యులకి తెలియలేదు. గురువుగారు, ఈ భక్తి గల వాళ్ళకి ప్రత్యేకంగా జ్ఞానము బోధిస్తున్నారా అని సందేహ పడ్డారు.

ఒక రోజు మందబుద్ధి గల శిష్యులు ఇలా అన్నారు “గురువుగారు, మీరు మాకు అన్యాయము చేస్తున్నారు అని అనిపిస్తోంది. మీ జ్ఞానము అంతా భక్తి గల శిష్యులకి ఇస్తున్నారు. అదే జ్ఞానము మాకు కూడా బోధించ వచ్చు కదా “,అని ప్రశ్నించారు!

దానికి గురువుగారు నిదానంగా సమాధానం ఇచ్చారు “నేను అందరినీ సమానంగానే  చూస్తాను. నాకు ఎవ్వరి మీద ప్రత్యేక అభిప్రాయము లేదు. మీలో ఎవరైనా తొందరగా నేర్చుకున్నారు అంటే, అది కేవలం, నా మాట మీద నమ్మకము, మీ యొక్క సొంత ప్రయత్నమూ ” అని స్పష్టంగా తెలియ పరచారు.

కానీ మందబుద్ధి గల శిష్యులకి, నమ్మకము కలగలేదు.

అప్పుడు గురువుగారు ఇలా అన్నారు ” మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. మీరు తరుచు వెళ్లే గ్రామానికి వెళ్లి ఒక మంచి వాడిని తీసుకుని రండి “.

మందబుద్ధి గల శిష్యులు ఆనందంతో, ‘ ఇంత సులభమైన పరీక్షకి, జ్ఞానము బహుమామా !” అని ఆనందించారు. వాళ్లలో ఒకడు ఉషారుగా బయలుదేరాడు, కానీ అతనికి మంచి వాడు ఎవ్వరు దొరకలేదు. ఎంతో వెతికాక, నిరుత్సాహంతో గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, “ఈ ఉరిలో మంచి వాడు ఒక్కడు లేడని చాలా బాధగా ఉంది. అందరూ ఏదో ఒక పాపం చేసిన వాళ్లే. ఈ ఊరిలో అందరూ తప్పు చేసిన వాళ్లే” అని చెప్పాడు.
దానికి గురువుగారు “ఓ అలాగా !!” మీకు ఎవరి పట్ల అయితే అసూయ కలిగిందో  వాళ్ళని పంపిద్దాము. అని అన్నారు.

భక్తి గల శిష్యులలో ఒక్కడిని పిలిచారు. ఈ గ్రామంలోకి వెళ్లి ఒక్క చెడ్డ వాడిని తీసుకుని రమ్మన్నారు. మీ అశీస్సులతో ప్రయత్నిస్తాను అన్నాడు.

శిష్యుడు తిరిగి వచ్చి “గురువుగారు నాకు ఎవ్వరూ చెడ్డ వాడు దొరకలేదు, నన్ను క్షమించండి ” అన్నాడు. గురువుగారి అనుమతి తీసుకుని అతను అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

అప్పుడు గురువుగారు “శిష్యులారా, ఎప్పుడైతే మీరు అన్నిటిలోను మంచిnea చూస్తారో , అప్పుడు మీలో జ్ఞానము వికసిస్తుంది” ఎప్పుడైతే అన్నిటిలోను తప్పు చూస్తామో మనలో ఉన్న జ్ఞానము క్షీణించుకు పోతుంది”

నీతి:
ప్రపంచంలో మంచి,చెడు రెండూ ఉంటాయి.
ఏ విషయమైనా మంచి అభిప్రాయము తో చూస్తే, మనిషి బాగా ఎదుగుతాడు.
తప్పు అభిప్రాయము తో చూస్తే, మనిషి ఎదుగుదల తగ్గిపోతుంది.
గురువుగారికి అందరూ సమానమే .

నిజ జీవితం లో కష్టాలని ఎలా ఎదురుకోవాలో ఈ కథ చెప్తోంది

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu