భజగోవిందం-బాలగోవిందము

 

bhajagovindam -1.png

జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు రచించిన గొప్ప వేదాంత గ్రంధములలో అత్యంత అద్భుతమైనది, తేట తెల్లంగా ,స్వచ్ఛముగా ,వేదాంత సారాన్ని అందించేది ‘భజగోవిందం’.

ఈ రచనకు మరో పేరు “మోహముద్గరము”. సంస్కృతంలో ‘మోహము’ అంటే “మాయ” అని అర్ధము. “ముద్గరము” అంటే “సమ్మెట లేక సుత్తి”. “మోహముద్గరము అంటే మాయను తొలగించేది, నశింపచేసేది అని అర్ధం.” భజగోవిందం ఈ ప్రపంచమనే సంసారంలో ,దేహభావనతో జీవించేవారి మోహమును పోగొట్టి ,మాయను తొలగింపచేసి  సత్యమును భోదిస్తుంది. కనుక దీనిని “మోహముద్గరము” అని కూడా  అంటారు.

ఒక రోజున శంకరాచార్యులు వారి శిష్యులతో కలిసి కాశీపుర వీధులలో పర్యటిస్తూ ఉండగా , దారిలో ఒక ముసలి పండితుడు పాణినీ వ్యాకరణ సూత్రములు వల్లె వేస్తూ కనిపించాడు. ఆ పండితుడి యొక్క దృష్టి, ఆసక్తి వ్యాకరణ సారాంశము మీద కాకుండా, కేవలము వ్యాకరణమును వల్లె వేయుటయందు, కంఠస్తము చేయుటయందు పరిమితమై ఉండుట గమనించారు ఆచార్యుల.అది చూసిన మరుక్షణమే ప్రేరణ పొందిన ఆచార్యుల వారిచే ప్రకటితమైన మహత్తరమైన భక్తి, జ్ఞాన సంపన్నమైన శ్లోకముల సముదాయమే భజగోవిందం.

భజగోవిందం యొక్క సందేశాన్ని, తెలికగా అర్ధమయ్యే నీతికధల రూపంలో విద్యార్థులకు,సాధకులకు అందచేయటంకోసం “సాయి బాలసంస్కా ర్ బృందం “వారు చేసిన వినయపూర్వక ప్రయత్నం , ఈ భజగోవిందం-బాలగోవిందము .

ఇంత గొప్ప వేదాంత రచన చేసిన “జగద్గురువులు ఆది శంకరాచార్యుల” వారికి  హృదయపూర్వక మైన,వినయపూర్వకమైన సాష్టాంగ ప్రణామములు అర్పిస్తున్నాము . తమ తమ వాఖ్యానములు  ,ప్రవచనముల ద్వారా ఈ వేదాంత సందేశమును సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన గురువులందరికీ హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామములను సమర్పిస్తున్నాను.

మేము చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం- చదివినవారందరికీ ప్రయోజనకరంగా ఉండి ,దైవాన్ని చేరుకోవటంలో వారి ప్రయాణానికి చిన్న మైలురాయిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

       సాయి బలసంస్కార్ బృందం.

https://m.facebook.com/neetikathalu

Leave a comment